Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'మై నేమ్ ఈజ్ రాజు'‌లో శోభన... చరణ్ తల్లిగానే..!

'మై నేమ్ ఈజ్ రాజు'‌లో శోభన... చరణ్ తల్లిగానే..!
, శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (12:54 IST)
ఒకప్పటి అందాల భామలు ఇటీవల మళ్లీ క్రీజ్‌పైకి వచ్చినట్టున్నారు. రమ్యకృష్ణ, నదియా అంటూ ఒకప్పటి క్రేజీ బ్యూటీలు ఇటీవల తల్లులు, అత్తల పాత్రల్లో వెండితెరపై వెలుగుతున్నారు. తాజాగా మాజీ హీరోయిన్ శోభన కూడా తల్లి పాత్రలకి షిఫ్ట్ కానుంది. నాగార్జున హీరోగా పరిచయం అయిన విక్రంతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన ఈ కేరళ బ్యూటీ శోభన కొన్నేళ్ళు సౌత్ లో టాప్ హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించింది. 
 
ఆమధ్య మోహన్ బాబు జంటగా గేమ్ సినిమాలో నటించిన శోభన ఇటీవల రజనీకాంత్ కొచ్చాడియాన్ లోనూ గెస్ట్ రోల్ చేసింది. ఇవే కాకుండా అప్పుడప్పుడు ఈవెంట్స్ లో డాన్స్ షో చేస్తుంది. ఇంకా పెళ్లి చేసుకోని శోభన ఓ పాపని దత్తత చేసుకొని పెంచుకుంటుంది. 
 
టాలీవుడ్‌లో ఒకప్పటి టాప్ హీరోలు అందరి జంటగా నటించిన శోభన ఇప్పుడు రామ్ చరణ్ తల్లిగా నటిస్తున్నట్టు టాలీవుడ్ టాక్.  శ్రీనువైట్ల దర్శకత్వంలో మార్చి లో సెట్స్ పైకి వెళ్ళే ఈ సినిమాకి మై నేమ్ ఈజ్ రాజు అనే వర్కింగ్ టైటిల్ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాలో మదర్ రోల్ కి ఇంపార్టెన్స్ ఉండడంతో రెగ్యులర్ ఆర్టిస్ట్స్ కి డిఫరెంట్ గా ఎవరైనా నటిస్తే బెటర్ అని శోభనని సంప్రదించి ఎంపిక చేశారట.

Share this Story:

Follow Webdunia telugu