వరుడు సినిమాలో బన్నీకి మదర్గా నటించిన సుహాసినికి అల్లు అర్జున్ క్లాస్ తీశాడు. మీడియాపై ఇటీవల ఫైర్ అయిన సుహాసినికి బన్నీ "మన సినిమా హిట్టైనప్పుడు మీడియాను పొగిడి, ఫ్లాప్ అయినప్పుడు రివ్యూవర్స్ని తిట్టకూడదు మేడమ్ "Mana cinema hittayyinappudu media nu pogidi, flop ayinappudu reviewers ni tittakoodadu madam" అంటూ ట్వీట్ చేశాడు.
ఇటీవల సుహాసిని మీడియాపై ఫైర్ అయ్యింది. కంప్యూటర్, కీ బోర్డ్ తెలిసినవారంతా రివ్యూలు రాసేయడం కాదని.. సినిమా రిపోర్టర్లు.. అర్హత కలిగిన వారే రివ్యూ రిపోర్టులు రాయాలని మండిపడింది. దీనిపై బన్నీపై విధంగా కామెంట్ చేసారు. ఇదిలా ఉంటే ఓకే బంగారం డైరక్టర్ మణిరత్నం ఓ ప్రకటనను చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అన్నీ మీడియా సంస్థలకు పంపారు. ఈ ప్రకటనలో ఓకే బంగారం హిట్కు సహకరించిన మీడియాకు ధన్యవాదాలు తెలిపారు.