'లెజెండ్' చిత్రం తర్వాత బోయపాటి శ్రీను ఏ చిత్రం చేస్తున్నాడనేది ఆసక్తిగా సాగింది. ఆ చిత్రం తర్వాత ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తన కుమారుడు శ్రీనివాస్ను హీరోగా నటించేట్లు ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. కానీ దీన్ని బోయపాటి ఖండిస్తూ వచ్చారు.
హీరో గెటప్ బాలీవుడ్ స్టైల్లో వుండాలి. కనుక దానిగురించి బాడీ బిల్డప్ గురించి టైమ్ పడుతుందని త్వరలో చేస్తానని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. అల్లు అర్జున్తో సినిమా ముందుకు వచ్చింది. అర్జున్ ఫార్మెట్లో బోయపాటి శ్రీను యాక్షన్తో సాగనున్నట్లు కథ సిద్ధమయింది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు ముగింపు దశలో వున్నాయి. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.