Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాపుకు అంత్యక్రియలు : అభిమానుల కన్నీటి వీడ్కోలు

బాపుకు అంత్యక్రియలు : అభిమానుల కన్నీటి వీడ్కోలు
, బుధవారం, 3 సెప్టెంబరు 2014 (10:57 IST)
ప్రముఖ దర్శకుడు బాపు భౌతిక కాయానికి మంగళవారం తమిళనాడు రాజధాని చెన్నైలో అంత్యక్రియలు జరిగాయి. పలువురు చిత్ర ప్రముఖులు, అభిమానుల కన్నీటి వీడ్కోళ్ల మధ్య స్థానిక బీసెంట్‌నగర్‌ శ్మశానవాటికలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన భౌతికకాయానికి దహనక్రియలు నిర్వహించారు.
 
తమిళనాడు గవర్నర్‌ డాక్టర్‌ కొణిజేటి రోశయ్య, సినీ నటులు మోహన్‌బాబు, రావి కొండలరావు, నాగినీడు, సంగీత, బోనీకపూర్‌, అనిల్‌కపూర్‌, గుండు సుదర్శనం, నేపథ్యగాయకులు ఎస్‌పీ బాలసుబ్రమణ్యం తదితరులు మంగళవారం బాపు భౌతికకాయానికి నివాళులర్పించారు. 
 
‘శ్రీరామరాజ్యం' సినిమాలో లవ, కుశ, బాలహనుమాన్‌ పాత్రధారులైన గౌరవ్‌, ధనుష్‌, పవన్‌శ్రీరాం బాపు పార్థివదేహానికి అంజలి ఘటించడాన్ని చూసి పలువురు కన్నీటిపర్యంతమయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu