Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రామ్ చరణ్‌తో సినిమా చేసేందుకు మూడేళ్ళు తిరిగాను: బండ్ల గణేష్

రామ్ చరణ్‌తో సినిమా చేసేందుకు మూడేళ్ళు తిరిగాను: బండ్ల గణేష్
, మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (12:03 IST)
మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్‌తో ఒక చిత్రం నిర్మించేందుకు మూడేళ్ళ పాటు ఆయన చుట్టు చెప్పులు అరిగిపోయేలా తిరిగినట్టు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ వెల్లడించారు. కొరటాల శివతో పిక్చర్ ప్లాన్ చేసినా, కథ బాగోలేని కారణంగా అది ఆగిపోయిందని తెలిపాడు. సినిమా ఆగిపోవడంతో షాక్ తగిలినట్టయిందని అన్నాడు. బావిలో పడ్డా ఈదవచ్చు, చెరువులో పడితే ఒడ్డుకు రావచ్చు కానీ, బోరులో పడ్డట్టయిందన్నారు. 
 
'గోవిందుడు అందరి వాడేలే' ఆడియో వేడుక సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన విషయం తెల్సిందే. ఇందులో చిత్ర నిర్మాత బండ్ల గణేశ్ తనదైన శైలిలో మాట్లాడి అందరినీ నవ్వించారు. రామ్ చరణ్ వద్దకు వెళ్ళి 'డిల్లకు డిల్లకు' పాటకు డ్యాన్సు చేస్తూ, ఎలాగోలా ఆయనను లైన్లో పెట్టుకున్నాని తెలిపారు. చరణ్‌ను లిటిల్ బాస్‌గా అభివర్ణించిన గణేశ్... అతనితో సినిమా తీసేందుకు మూడేళ్ళపాటు తిరిగానని చెప్పాడు. 
 
ఆ తర్వాత తనకిచ్చిన మాట కోసం ఎనిమిది నెలలు ఖాళీగా ఉన్నాడని, తనతోనే సినిమా చేశాడని చెప్పాడు గణేశ్. 'మీరు చల్లగా ఉండాలి బాస్' అంటూ రామ్ చరణ్‌ను ఉద్దేశించి అన్నాడు. రామ్ చరణ్‌కు బడ్జెట్‌పై ఎంతో శ్రద్ధ ఉందన్నాడు. 'అమ్మా మీ కడుపున కోహినూర్ వజ్రం పుట్టింది. ఆ వజ్రం వెలుగులో మేమంతా ప్రకాశిస్తూ ఉంటాం' అని రామ్ చరణ్ తల్లి సురేఖను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. 

Share this Story:

Follow Webdunia telugu