Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలయ్యకు పోటీగా రమ్యశ్రీ... ''లైన్''నే ఢీకొట్టాలంటోంది...

బాలయ్యకు పోటీగా రమ్యశ్రీ... ''లైన్''నే ఢీకొట్టాలంటోంది...
, బుధవారం, 22 ఏప్రియల్ 2015 (15:42 IST)
చేస్తేగీస్తే.. పెద్ద హీరోలతో పోటీగా చేస్తే బాగుంటుందని.. నటి రమ్యశ్రీ అంటోంది. ఆమె నటించిన 'ఓ మల్లి' చిత్రాన్ని బాలయ్య లైన్ చిత్రం విడుదల రోజునాడే విడుదల చేస్తానని ప్రకటించింది. ఇంకా ప్రమోషన్‌ కూడా మొదలుపెట్టని ఆమె... ఏమి ప్రమోషన్‌ చేసి.. అల్లు అర్జున్‌ వంటి చిత్రాలు విడుదల చేస్తున్నారంటూ లాజిక్కు చెబుతోంది. కాగా, లయన్‌లో మణిశర్మ అందించిన సంగీతం ఇటీవలే విడుదలై మంచి స్పందనని అందుకుంటోంది.
 
సత్య దేవా దర్శకుడు. ఈ చిత్రాన్ని మే 1న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాను అదే రోజున మరో చిన్న చిత్రం ఢీ కొట్టనుంది. ఇది కాకుండా..తమిళ 'శైవం' సినిమాను తెలుగులో 'దాగుడుమూతల దండాకోర్‌'గా విడుదల చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్‌ ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమాలో అచ్చ తెలుగు మమకారాన్ని, ఆప్యాయతను చూపించినట్టు సమాచారం. ఒరిజినల్‌ మాతృక తెగ నచ్చేయడంతో దర్శకుడు క్రిష్‌ నిర్మాతగా మారి రామోజీరావుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Share this Story:

Follow Webdunia telugu