Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దోషం వల్లే రుద్రమదేవి నగలు మాయం : అనుష్క - అందుకే పూజలు

దోషం వల్లే రుద్రమదేవి నగలు మాయం : అనుష్క - అందుకే పూజలు
, సోమవారం, 15 సెప్టెంబరు 2014 (11:45 IST)
ఏదో దోషం వల్లే "రుద్రమదేవి" బంగారు నగలు మాయమైనట్టు ఆ చిత్ర ప్రధాన పాత్రధారి అనుష్క భావిస్తోంది. అందుకే ప్రత్యేకంగా దోష నివారణ పూజలు చేస్తున్నట్టు ఈ ముద్దుగుమ్మ చెపుతోంది. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ "బంగారు నగలు కావడంతో వాటి విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకున్నాం. అయినా అవి మాయమవడం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. పైగా, ఇంకా ఏదైనా జరుగుతుందేమోనని భయపడ్డాను. ఏదో దోషం వల్లే ఇలా జరిగుండచ్చు. అందుకే, రుద్రమదేవి ఆలయంలో దోష నివారణ పూజలు చేశాను" అని చెప్పింది అనుష్క.
 
నిజానికి ఈ అందాల ముద్దుగుమ్మకు సెంటిమెంట్లు ఎక్కువే. దీనికితోడు దైవభక్తి కూడా ఎక్కువ. అందుకే, ఇప్పుడు ఘనంగా దోషనివారణ పూజలు నిర్వహించింది. 'రుద్రమదేవి' సినిమా షూటింగులో ఇటీవల బంగారు ఆభరణాలు మాయమవడం ... ఆ సంఘటన సంచలనం సృష్టించడం మనకు తెలుసు. దీంతో ఏదో దోషం వల్లే ఇలా జరిగివుంటుందని స్వీటీ నమ్ముతోంది. 

Share this Story:

Follow Webdunia telugu