వ్యాపారవేత్త నెస్ వాడియాతో జరిగిందంతా దురదృష్టకరమైందని బాలీవుడ్ నటి ప్రీతిజింటా తెలిపింది. నెస్ వాడియాతో జరిగిన వివాదం, ఆరోపణలు, కేసులపై స్పందించిన ప్రీతి జింటా, తామిద్దరి మధ్య జరిగిందంతా దురదృష్టకరమైందని చెబుతోంది. తనకు, మాజీ ప్రియుడికి మధ్య వివాదాలు వచ్చినప్పటికీ ఐపీఎల్లో తన ఫ్రాంఛైజీ నుంచి దూరం కావాలనుకోవడం లేదని తెలిపింది.
మరోవైపు ప్రీతి వ్యాఖ్యలపై వాడియా కూడా స్పందించాడని, కానీ జింటా పెట్టిన కేసుపై మాత్రం కామెంట్ చేసేందుకు తిరస్కరించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఓ కార్యక్రమంలో వాడియా గురించి ప్రీతిని ఓ జర్నలిస్టు అడగ్గా విసుగుచెందినట్టు తెలిసింది. ప్రతిసారీ ఆ విషయాల గురించి ఎందుకు అడుగుతారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
కాగా భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్తో ప్రీతి జింటా క్లోజ్గా ఉన్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. నెస్ వాడియాతో వివాదానంతరం యువీ జింటాకు సపోర్ట్గా నిలబడటంతో యువరాజ్ సింగ్తో ప్రీతి జింటా లవ్వాయణం కొనసాగించడమే కాకుండా.. సహజీవనం కూడా చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.