Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రాపోరీతో పూరీ జగన్నాథ్ తనయుడు.. తెలంగాణలో ప్రారంభం!!

ఆంధ్రాపోరీతో పూరీ జగన్నాథ్ తనయుడు.. తెలంగాణలో ప్రారంభం!!
, శుక్రవారం, 19 డిశెంబరు 2014 (17:10 IST)
బాలనటుడుగా కొన్ని సినిమాలలో నటించిన పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా పేరు 'ఆంధ్రా పోరి'. దీని షూటింగ్ హైదరాబాదులో మొదలైంది. 'ఝాన్సీ' హిందీ సీరియల్ లో బాల ఝాన్సీగా నటించిన ఉల్కా గుప్తా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది.
 
'రుషి' ఫేం రాజ్ ముదిరాజు దర్శకత్వంలో రమేష్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి పూరీ జగన్నాథ్ క్లాప్ ఇవ్వగా, రమేష్ ప్రసాద్ కెమెరా స్విచాన్ చేశారు. పూరీ భార్య లావణ్య గౌరవ దర్శకత్వం వహించారు. ఇది బ్యూటీఫుల్ టీనేజ్ లవ్ స్టోరీ అని దర్శకుడు చెప్పాడు. 
 
ఇది తమ బ్యానర్ నుంచి వస్తున్న 30వ చిత్రమని నిర్మాత రమేష్ ప్రసాద్ చెప్పారు. మరాఠీ సినిమా 'టైం పాస్' ఆధారంగా ఇది రూపొందుతోంది.

Share this Story:

Follow Webdunia telugu