Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యాంకర్ సుమ మామ స్థలం కబ్జా : పోలీసులకు ఫిర్యాదు

యాంకర్ సుమ మామ స్థలం కబ్జా : పోలీసులకు ఫిర్యాదు
, బుధవారం, 28 జనవరి 2015 (14:44 IST)
ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లో దౌర్జన్యపు భూఆక్రమణలు ఎక్కువై పోతున్నాయి. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన రాజీవ్ కనకాల తండ్రి, సీనియర్ నటుడు అయిన దేవదాస్ కనకాలకు చెందిన భూమిని గుర్తు తెలియని వ్యక్తులు కొందరు కబ్జా చేశారు. ఈ విషయం తెలుసుకున్న వారు హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. 
 
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లో దేవదాస్ కనకాలకు చెందిన స్థలంలో గత ఆర్థరాత్రి కొందరు దుండగులు ప్రవేశించి, అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. స్థానికులందించిన సమాచారంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న దేవదాస్ తదితరులు దుండగులను వెళ్లిపొమ్మని కోరారు. అందుకు వారు ససేమిరా అనడంతో, పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu