Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

న్యాయం కోసం పవన్ ఇంటికెళ్లి కూర్చుంటా : నటి హేమ

న్యాయం కోసం పవన్ ఇంటికెళ్లి కూర్చుంటా : నటి హేమ
, ఆదివారం, 29 మార్చి 2015 (12:56 IST)
తనకు న్యాయం చేయాలని కోరుతూ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటి ముందు కూర్చొంటానని నటి హేమ ప్రకటించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా నటీనటుల మధ్య విభేదాలు పొడచూపిన విషయం తెల్సిందే. దీంతో నటీనటులు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. 
 
తాజాగా రాజేంద్రప్రసాద్‌కు మద్దతిస్తున్న శివాజీ రాజా తనను వ్యక్తిగతంగా దూషించారని నటి హేమ ఆరోపించారు. శివాజీ రాజా ఓ టీవీ ఇంటర్వ్యూకు వెళ్లి హేమ ఒక తుప్పు పట్టిన యంత్రం అని తనను ఉద్దేశించి వ్యాఖ్యానించారని తెలిపారు. శివాజీ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. 
 
ఈ విషయంపై చిరంజీవితో మాట్లాడుతానని, ఇంకా పవన్‌కళ్యాణ్ ఇంటికెళ్లి కూర్చుంటానని స్పష్టం చేశారు. పవన్ అందరికీ మంచి చేస్తాడు కదా.. తనకు మంచి చేయమని అడుగుతానని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని దాసరి నారాయణరావు దృష్టికి తీసుకెళ్లానని గుర్తు చేశారు. ఎన్నికల అనంతరం సమస్య పరిష్కరిద్దామని దాసరి చెప్పారని తెలిపారు.  

Share this Story:

Follow Webdunia telugu