Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టాలీవుడ్ నటి మాలశ్రీకి యాసిడ్ దాడి బెదిరింపులు..!

టాలీవుడ్ నటి మాలశ్రీకి యాసిడ్ దాడి బెదిరింపులు..!
, శనివారం, 28 ఫిబ్రవరి 2015 (09:51 IST)
ప్రముఖ టాలీవుడ్‌ నటి తనపై యాసిడ్ దాడి బెదిరింపులు వచ్చినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె తన ఫిర్యాదులో తన వద్ద పని చేస్తున్న ఉద్యోగి తనపై యాసిడ్ దాడి చేస్తానని బెదిరిస్తున్నట్టు తెలిపింది. ఆమె బెంగుళూరులో భర్త రాముతో కలిసి ఉంటుంది. ఆమెకు చెన్నైలో ఒక మాల్, అపార్ట్ మెంట్‌లు ఉన్నాయి.
 
వాటి నిర్వహణ బాధ్యతలు అంతా మాలశ్రీనే చూసుకుంటుంది. ఈ స్థితిలో అపార్ట్ మెంట్‌ను విక్రయించేందుకు సిద్ధంకాగా, అందులో పని చేస్తున్న ఒక ఉద్యోగి తనను బెదిరిస్తున్నట్టు తెలిపింది. అపార్ట్ మెంట్ అమ్మితే తనకు ఆ డబ్బులో వాటా ఇవ్వాలని, లేదంటే యాసిడ్ దాడి చేస్తానంటూ బెదిరిస్తున్నట్టు తెలిపింది. అతని వెంట మరో ఇద్దరు కూడా ఉన్నారని ఆమె తన ఫిర్యాదులో వెల్లడించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu