Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

3 రోజుల్లో 'రచ్చ' చేసిన వసూళ్లు అక్షరాల రూ. 15 కోట్లు

3 రోజుల్లో 'రచ్చ' చేసిన వసూళ్లు అక్షరాల రూ. 15 కోట్లు
, సోమవారం, 9 ఏప్రియల్ 2012 (14:40 IST)
WD
చిరంజీవి తనయుడు రామ్‌ చరణ్‌ నటించిన 'రచ్చ' సినిమా ఈ నెల 5న విడుదలైంది. విడుదలైన 3 రోజుల్లోనే రూ. 15 కోట్ల షేర్‌ వచ్చిందని చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎన్వీప్రసాద్‌ తెలియజేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

మెగా సూపర్‌గుడ్‌ బేనర్‌లో ఎన్నో సినిమాలు తీశాం. ఇంత పెద్ద చిత్రం చేయడం ఇదే మొదటిసారి. మా బేనర్‌లో ఇంతవరకు రాని కలెక్షన్లు ఈ సినిమాతో వచ్చాయి. ఈ విజయం చిరంజీవి అభిమానుల విజయమని చెప్పారు.

రామ్‌ చరణ్‌, తమన్నా జంటగా నటించిన ఈ సినిమాకు సంపత్‌నంది దర్శకుడు. ఏమైంది ఈ వేళ- సినిమా చేశాక రామ్‌ చరణ్‌ సినిమాకు ఆఫర్‌ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని సంపత్ అన్నారు. ఈ చిత్ర కథను చిరంజీవికి చెప్పాను. ఆయన మొదటి నుంచి ఎంతో సహకరించారు. ఆయన అంగీకరించకపోతే ఈ సినిమానే లేదని దర్శకుడు సంపత్‌నంది చెప్పారు.

సంపత్ మాట్లాడుతూ... నేను ఏదో పెద్ద కళాఖండం తీయలేదు. కమర్షియల్‌ సినిమా తీశానని చెప్పగలను. మొదట్లో ఈ సినిమా తీసేటప్పుడు ఎన్నో టాపిక్‌లు వచ్చాయి. సినిమా విడుదలకు ముందు కూడా కామెంట్లు వచ్చాయి. రిలీజ్‌ తర్వాత రచ్చ సత్తా ఏమిటో చూపించింది. అద్భుతమైన హిట్‌ ఇచ్చారు ప్రేక్షకులు అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu