Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైస్కూల్ అయిపోయింది.. ఇప్పుడు నైన్త్ క్లాస్ మొదలైంది

హైస్కూల్ అయిపోయింది.. ఇప్పుడు నైన్త్ క్లాస్ మొదలైంది
టీనేజ్‌లో అడుగిడిన విద్యార్థుల ఆలోచనా సరళి ఏవిధంగా ఉంటుంది. పరస్పరం ఏవిధంగా ఆకర్షితులవుతారు అనే కాన్సెప్ట్‌తో మానస ఆర్ట్ మూవీస్ ద్వితీయ చిత్రాన్ని నైన్త్ క్లాస్ కేరాఫ్ ఏలేశ్వరం పేరుతో నిర్మిస్తోంది. ప్రణయ్, మనీషా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. 

గత ఏడాది తొమ్మిదవ తేదీన ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించారు. తొలి షెడ్యూల్ వైజాగ్, గాజువాక, సబ్బవరంలో జరిపామనీ, దాదాపు 30 శాతం టాకీ పూర్తి చేశామని దర్శకుడు, నిర్మాత యం. రాజ్‌కుమార్ చెప్పారు. ఇటీవలే ఆరు పాటలను రికార్డ్ చేసినట్లు తెలిపారు.

ఈ చిత్రంలో సుమన్, నాజర్, దండపాణి, వేణు మాధవ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ మాజీమంత్రి ఎ. చంద్రశేఖర్, మాటలు: అరుణ్, సంగీతం: సత్యం, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: యం. రాజ్‌కుమార్

Share this Story:

Follow Webdunia telugu