నాని, మాధవీలత జంటగా జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ సమర్పణలో కొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది. సత్య ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు సత్యం బెల్లంకొండ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ప్రేమతో కూడిన వినోదాత్మక చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి "స్నేహితుడా" అనే పేరును నిర్ణయించినట్లు దర్శకులు తెలిపారు.
ప్రేమకథా చిత్రమే అయినప్పటికీ కుటుంబ విలువలు కూడా ఇందులో ఉన్నాయని దర్శకుడు వెల్లడించారు. యూత్, కుటుంబ ప్రేక్షకులను అలరించే విధంగా ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా రూపొందించినట్లు ఆయన అన్నారు. శివశంకర్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్గా ఉంటుందని దర్శకుడు వివరించారు.
ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉందని, ఈ నెలాఖరులో ఆడియోను, జూన్లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సత్యం బెల్లంకొండ అన్నారు.
ఈ సినిమాలో సుత్తివేలు, బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, మేల్కొటి, దువ్వాసి మోహన్, గుండు సుదర్శన్, రవికిరణ్ నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాకు కెమేరా.. వాసు, మాటలు, పాటలు.. భాషా శ్రీ, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం.. సత్యం బెల్లంకొండ.