స్టైలిష్స్టార్ అల్లు అర్జున్ 'ఇద్దరమ్మాయిలతో' ఫస్ట్ లుక్ రిలీజ్..!
, శనివారం, 9 మార్చి 2013 (20:00 IST)
స్టైలిష్స్టార్ అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలతో ఫస్ట్ లుక్ శనివారం రిలీజయింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ల క్రేజీ కాంబినేషన్లో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై శివబాబు బండ్ల సమర్పణలో 'గబ్బర్సింగ్' నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తోన్న భారీ చిత్రం 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం షూటింగ్ స్పెయిన్లో శరవేగంగా జరుగుతోంది. మార్చి 9న మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ని రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ - ''మా ఇష్ట దైవం పరమశివుడు. మా బేనర్ పేరు కూడా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్. ఈరోజు మహా శివరాత్రి. ఈ రోజే నా పుట్టినరోజు కూడా కావడం నా అదృష్టం. ఇది నాకు కీలకమైన సంవత్సరం. 'గబ్బర్సింగ్' వంటి బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ తర్వాత ఎన్టీఆర్-శ్రీనువైట్ల కాంబినేషన్లో 'బాద్షా', అల్లు అర్జున్-పూరి జగన్నాథ్ల కాంబినేషన్లో ఈ 'ఇద్దరమ్మాయిలతో' చిత్రాల్ని నిర్మించడం నాకు చాలా ఆనందంగా వుంది. బన్నీ కెరీర్లో నెంబర్వన్ ఫిల్మ్ అయ్యేలా 'ఇద్దరమ్మాయిలతో' చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నారు పూరీ జగన్నాథ్గారు. పూరీగారు నాకు ఇరవై ఏళ్ళుగా మిత్రుడు. నేను నిర్మాతని కావడానికి పూరి జగన్నాథ్గారు నన్నెంతగానో ప్రోత్సహించారు. ఆయన దర్శకత్వంలో నిర్మిస్తోన్న ఈ 'ఇద్దరమ్మాయిలతో' మా బేనర్కి మరో బ్లాక్బస్టర్ కాబోతోంది. సమ్మర్ స్పెషల్గా ఈ చిత్రాన్ని మే నెలలో రిలీజ్ చెయ్యబోతున్నాం. బ్యాంకాక్లో ఇంటర్నేషనల్ ఫైట్మాస్టర్ కిచ్చా ఆధ్వర్యంలో ఈ చిత్రం కోసం పిక్చరైజ్ చేసిన యాక్షన్ పార్ట్ ఎక్స్ట్రార్డినరీగా వచ్చింది. అలాగే ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య నేతృత్వంలో స్పెయిన్లో చిత్రీకరించిన పాట ఈ చిత్రానికి ఓ స్పెషల్ హైలైట్ అవుతుంది. అలాగే అటు అల్లు అర్జున్కి ఆర్య, బన్నీ, ఆర్య2, జులాయి వంటి బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్స్ ఇచ్చి, ఇటు మా బేనర్కి 'గబ్బర్సింగ్' వంటి మ్యూజికల్ బ్లాక్బస్టర్ ఇచ్చిన దేవిశ్రీప్రసాద్ 'ఇద్దరమ్మాయిలతో' చిత్రాన్ని కూడా మరో మ్యూజికల్ బొనాంజాగా మలిచారు. పూరి జగన్నాథ్ కాంబినేషన్లో దేవికి ఇదే తొలి చిత్రం కావడంతో ఈ చిత్రాన్ని ఖచ్చితంగా పెద్ద మ్యూజికల్ హిట్ చేసే దిశగా అద్భుతమైన ఆడియోని అందించారు. టోటల్గా మా 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం క్వాలిటీ వైజ్ ఎంత గ్రాండ్గా వుంటుందో కంటెంట్ వైజ్ కూడా అంత ట్రెమండస్గా వుంటూ మంచి రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా అందర్నీ అలరించే చిత్రమవుతుందని కాన్ఫిడెంట్గా చెప్పగలను'' అన్నారు.అల్లు అర్జున్, అమలాపాల్, కేథరిన్, బ్రహ్మానందం, నాజర్, షావర్ అలీ, సుబ్బరాజు, శ్రీనివాసరెడ్డి తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: అమోల్ రాథోడ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఆర్ట్: బ్రహ్మ కడలి, కో డైరెక్టర్: రెడ్డి తరణీరావు, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, కథ-మాటలు-స్క్రీన్ప్లే-దర్శకత్వం: పూరి జగన్నాథ్