"మల్లీశ్వరి", "పిడుగు" వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన అందాల ముద్దుగుమ్మ, బాలీవుడ్ అగ్రహీరోయిన్ కత్రీనా కైఫ్.
మోడలింగ్ ఫీల్డ్లో రాణించిన కత్రీనా.. బాలీవుడ్లో "బూమ్" చిత్రం ద్వారా రంగ ప్రవేశం చేసింది. విదేశాల నుంచి భారత్కు దిగుమతైన ఈ ఆసియా అందగత్తె 17 ఏళ్ల వయసులో లండన్ నుంచి ఇండియాకు వచ్చేశానని అంటోంది.
ఇండియాకి వచ్చే సమయంలో తన వద్ద 4 లక్షలు మాత్రమే ఉన్నాయని, లండన్లో ఖాజిద్ అనే వ్యక్తి సూచనమేరకు ముంబై చేరుకున్నానని కైపు కన్నుల కత్రీనా చెబుతోంది.
మోడలింగ్ నుంచి సినిమా రంగంలోకి అరంగేట్రం చేసిన తాను ఈ ఫీల్డ్లో బాగా సెటిల్ అయ్యాయని కైఫ్ అంటోంది.
తన చెల్లెలు ఇసబెల్లేకూడా తనతోనే ఉంటుందనీ, ఆమెకూడా అవకాశాల కోసం ఎదురుచూస్తుందని కత్రీనా చెప్పింది. మొన్ననే ఇక లండన్ వెళ్ళిపోదానమి చెల్లెలు తనతో చెప్పింది.
అయితే ఇండియా వదిలి నువ్వెళితే వెళ్లు..! 4 లక్షలతో వచ్చిన తాను స్థిరపడానికి ఇండియానే కారణమని అందుకే రానని తేల్చిచెప్పానని కైఫ్ అంటోంది. ఇక సల్మాన్ఖాన్ గురించి మీడియాతో చెప్పి చెప్పి విసిగిపోయానని, నమ్మిన వారికి ప్రాణమిచ్చే వ్యక్తిత్వం ఆయనదని కితాబిచ్చింది.