Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"షటప్ యువర్ మౌత్'' అంటున్న శ్రుతిహాసన్...!

, శుక్రవారం, 9 ఆగస్టు 2013 (08:33 IST)
FILE
కమల్ హాసన్ కుమార్తెగా సినీఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. శృతిహాసన్‌కి రానివిద్యఅంటూ లేదు. నటనే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరించింది. బేసికల్‌గా మంచి గాయని అన్న సంగతి మనకు తెలిసిందే. సినిమాల్లోకి రాని క్రితమే తాను ఆల్బమ్స్ రిలీజ్ చేసింది.

అలాగే అప్పుడప్పుడు తన సినిమాల్లో కూడా పాటలు పాడుతుంటుంది. ప్రస్తుతం నటన అనేది ఆమె వృత్తి అయితే, సింగింగ్ అనే దానిని హాబీలా పెట్టుకుంది. ఆ క్రమంలో తాజాగా ఓ తమిళ సినిమాకు ఓ ఐటెం సాంగ్ పాడినట్లు తెలుస్తుంది. తెలుగులో హిట్టయిన 'అలా మొదలైంది' చిత్రాన్ని ప్రస్తుతం తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం శృతి హాసన్ ఓ పాట పాడిందని సమాచారం.

'కడలి'ఫేం గౌతమ్ కార్తీక్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో... స్వతహాగా మంచి గాయని అయిన శ్రుతిహాసన్‌తో ఓ పాట పాడించేశారు ఆ చిత్ర దర్శక, నిర్మాతలు. ఆ పాట ప్రారంభంలో వచ్చే పదం 'షటప్ యువర్ మౌత్'. ఈ పాట తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని ఆ చిత్రం యూనిట్ సమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu