Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెంకీ చేతుల మీదుగా "బీన్జ్ కాఫీ విలేజ్" ప్రారంభం

వెంకీ చేతుల మీదుగా
WD
"అమ్మచెప్పింది", "గమ్యం" ఫేం హీరో శర్వానంద్‌కు చెందిన "బీన్జ్-ది అర్బన్ కాఫీ విలేజ్"ను హీరో విక్టరీ వెంకటేష్ ప్రారంభించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.15 రామాలయం టెంపుల్ ఎదురుగాగల ఈ హోటల్‌ను వెంకీ ప్రారంభించారు.

ఈ హోటల్ ప్రారంభోత్సవంలో నటులు ఆర్యన్ రాజేష్, మంచు విష్ణువర్ధన్ బాబు, లక్ష్మీప్రసన్న, రామ్, భరత్, అర్జన, నిర్మాచ గుణ్ణం గంగరాజు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ... ఎప్పటి నుంచో మంచి కాఫీ షాప్ నెలకొల్పాలని ఆలోచన ఉండేదన్నారు. ఇప్పుడన్నీ అధునాతనమైనవేనని, కానీ విలేజ్ వాతావరణంలో ఆహ్లాదకరంగా వుండే విధంగా నెలకొల్పాలని చేసిన ప్రయత్నమిదన్నారు.

త్వరలో గచ్చిబౌలీలోనూ కాఫీ విలేజ్ నెలకొల్పనున్నామని, ఆ తర్వాత వైజాగ్, చెన్నై, బెంగళూరులలో ప్రారంభించనున్నట్లు శర్వానంద్ పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu