మెగా పవర్స్టార్ రామ్ చరణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న 'ఎవడు' సినిమాలో అల్లు అర్జున్ అతిధి పాత్రలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే సినిమాలో ఒక ట్విస్ట్ ఉందట. సినిమాలోని కథ అంతా అల్లు అర్జున్దేనట. కాని రామ్ చరణే, అతిధిగా వచ్చి మొత్తం కథ అంతా నడుపుతాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సినిమా ప్రఖ్యాత హాలీవుడ్ సినిమా 'ఫేస్ ఆఫ్' కథను ఆధారంగా తీసుకుని నిర్మిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రామ్ చరణ్ తేజ, శృతిహాసన్ జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న 'ఎవడు' సినిమాపై ప్రస్తుతం రకరకాల కథలు ప్రచారం అవుతున్నాయి. అయితే ఈ సినిమాలో ప్రధాన పాత్ర అల్లు అర్జున్దేనట. కథ నడిచిన కొద్దిసేపటి తర్వాత ఆ పాత్ర రామ్ చరణ్గా మారుతుందట. అక్కడి నుంచి బన్నీ వెర్షన్ బయటకు కనిపిస్తున్న రామ్ చరణ్ పాత్రలో ఉంటుందట. అంటే ఈగ సినిమాలాగ అన్నమాట. 'ఈగ' సినిమాలో నానియే ప్రధానపాత్ర అయినప్పటికీ, సినిమా మొత్తం ఈగే కనిపిస్తుంది కదా. అలాగే చరణ్ రూపంలో బన్నీ కనబడతాడని సినీవర్గాలు అంటున్నాయి.