Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"యంగ్ ఇండియా" పాటల రికార్డింగ్ ప్రారంభం

WD
దర్శకరత్న డా. దాసరి నారాయణరావు అంతా కొత్తవారితో తీయనున్న చిత్రం యంగ్ ఇండియాకు సంబంధించి పాటల రికార్డింగ్ కార్యక్రమాన్ని గురువారం ప్రసాద్‌ల్యాబ్స్ థియేటర్‌లో ప్రారంభించారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.

ఇకపోతే.. దాసరి, కీరవాణి కాంబినేషన్‌లో చాలాకాలం తర్వాత వస్తోన్న చిత్రమిది. ఇందులో ఆరు పాటలుంటాయని, 20లోగా రికార్డింగ్ పూర్తవుతుందని దాసరి పేర్తొన్నారు.

ఈ సినిమాలో అంతా కొత్తవారిని పరిచయం చేయనున్నారు. రోజుకు 25మందిని ఎంపికచేసే ప్రక్రియకు కూడా గురువారం నాడే శ్రీకారం చుట్టారు. త్వరలో దిబెస్ట్ వివరాలను ప్రకటించనున్నట్లు దాసరి వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu