మహేష్ బాబు : 30 సెకన్లకు రూ. 2 కోట్లు తీసుకుంటున్నాడట!
, సోమవారం, 10 ఫిబ్రవరి 2014 (14:01 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు 30 సెకన్లకు రూ. 2 కోట్లు తీసుకుంటున్నాడట. ఇదేదో సినిమా షూటింగ్ కాదండీ బాబోయ్.. యాడ్కే. వరుస హిట్లతో ఊపుమీదున్న మహేష్ బాబు ఏడాదికి రూ. 35 కోట్లు పారితోషికం కింద పుచ్చుకుంటున్నాడు. తాజాగా ఓ ఫోన్ యాడ్లో నటించేందుకు మహేష్ బాబు భారీ పారితోషికం పుచ్చుకున్నాడని తెలిసింది. కేవలం 30 సెకన్లకే రూ. 2 కోట్ల వరకు ప్రిన్స్ పారితోషికం తీసుకున్నాడని సమాచారం. దీనిని బట్టి మహేష్ బాబు స్టాండ్ ఏంటో అర్థమైపోతుందని సినీ పండితులు అంటున్నారు. ఇకపోతే, మహేష్ బాబు తాజాగా ఆగడు చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో మహేష్ బాబు సరసన తమన్నా నటిస్తోంది. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నా ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చుతున్నారు. అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపిచంద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 26వ తేదీన విడుదల చేయనున్నారు.