'మనం'లో అఖిల్ కన్పిస్తాడా
, బుధవారం, 2 ఏప్రియల్ 2014 (22:25 IST)
అక్కినేని కుటుంబమంతా కలిసి నటిస్తున్న చిత్రం 'మనం'. మూడు తరాలు ఇందులో కన్పించనున్నారు. అందుకే ఈ చిత్రానికి ప్రత్యేకత సంతరించుకుంది. ఇందులో అఖిల్ కూడా కన్పించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే నాగార్జున అప్పట్లో ఖండించారు. కానీ... కొన్ని కారణాల వల్ల అఖిల్ కూడా పాల్గొనేట్లు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ మేరకు అఖిల్పై ఓ ప్రత్యేక పాటను చిత్రీకరించమని దర్శకుడు విక్రం కుమార్కు చెప్పినట్లు సమాచారం. త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్రం చూస్తే కానీ అఖిల్ ఉన్నాడో లేదో తెలియదుమరి.