బ్యాంకాక్లో 'నాకూ ఓ లవరుంది' పాటల చిత్రీకరణ
కృష్ణుడు హీరోగా మాస్టర్ హేమచంద్రారెడ్డి, బేబి హేమశ్రీ సమర్పణలో శ్రీశివపార్వతి కంబైన్స్ బేనర్పై రూపొందుతున్న 'నాకూ ఓ లవరుంది' పాటలు మినహా టాకీపార్ట్ పూర్తి చేసుకుంది. పాటల చిత్రీకరణ కోసం ఈ చిత్ర యూనిట్ మే 11న బ్యాంకాక్ వెళ్తోంది.ఈ సందర్భంగా నిర్మాత కె.సురేష్బాబు మాట్లాడుతూ - ''సక్సెస్ఫుల్గా టాకీ కంప్లీట్ చేశాం. మేం ముందుగా అనుకున్న రోజుల్లోనే షూటింగ్ పూర్తయింది. చిత్రంలోని ఐదు పాటల్లో ఒక పాటను ఐటమ్ సాంగ్గా చిత్రీకరించాం. మిగిలిన పాటలను హీరో, హీరోయిన్లపై చిత్రీకరించేందుకు మే 11న బ్యాంకాక్ వెళ్తున్నాం. అక్కడ అందమైన లొకేషన్స్ ఈ పాటల చిత్రీకరణ చెయ్యబోతున్నాం. ఈ చిత్రానికి మెయిన్ ఎస్సెట్ రాధాకృష్ణన్ మ్యూజిక్. తప్పకుండా ఈ ఆడియో చాలా పెద్ద హిట్ అవుతుంది. మే 27న ఈ ఆడియో రిలీజ్ను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్లో సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు. కృష్ణుడు, రితిక, ఎం.ఎస్.నారాయణ, సురేష్, ఆలీ, హేమ, ఉషశ్రీ, గీతాసింగ్, మాస్టర్ భరత్, మున్నా వేణు, శివన్నారాయణ, అనంత్, ధనరాజ్, ఖడ్గం పృథ్వీ, పొట్టి రాంబాబు, తాగుబోతు రమేష్, గుండు హనుమంతరావు, రఘు కారుమంచి నటిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: రాఘవ టి., పాటలు: లక్ష్మీభూపాల్, పెద్దాడమూర్తి, సంగీతం: కె.ఎం.రాధాకృష్ణన్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, ఆర్ట్: కృష్ణమాయ, కెమెరా: ఎస్.డి.జాన్, సమర్పణ: మాస్టర్ హేమచంద్రారెడ్డి, బేబి హేమశ్రీ, నిర్మాత: కె.సురేష్బాబు, స్క్రీన్ప్లే-దర్శకత్వం: కె.రామ్వెంకి.