Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బెల్లంకొండపై కేసులు... రాజీకి వచ్చేస్తారట...

బెల్లంకొండపై కేసులు... రాజీకి వచ్చేస్తారట...
, గురువారం, 24 జనవరి 2013 (22:16 IST)
WD
నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై రెండుచోట్ల కేసులు నమోదయ్యాయి. బంజారాహిల్స్‌లోనూ, జూబ్లీహిల్స్‌లోనూ కేసులు నమోదయ్యాయి. దీనికి కారణం తాను తీస్తున్న 'జబర్‌దస్త్‌' సినిమా గురించే. ఈ చిత్రం సిద్దార్థ్‌, సమంత కాంబినేషన్‌లో నందినీరెడ్డి దర్శకత్వం వహిస్తుంది.

ఈ చిత్రం ఓవర్‌సీస్‌ హక్కుల విషయంలో ఫైనాన్సియర్‌ రాధాకృష్ణపై చేయిచేసుకున్నాడని సమాచారం. తన కార్యాలయంలో రెండు రోజులక్రితం చర్చలు జరిపి 25 లక్షల అగ్రిమెంట్‌ అయ్యాక... అనుకోకుండా మాటామాటా పెరిగి వాగ్వివాదం తారాస్థాయికి చేరింది. దీంతో సురేష్ తనపై దాడి చేశాడని ఫిర్యాదు చేశాడు రాధృకష్ణ.

ఇప్పటికే బెల్లంకొండపై పలు కేసులున్నాయి. గతంలో బాలకృష్ణ విషయంలో పెద్ద రాద్దాంతమే జరిగింది. ప్రస్తుతం ఈ కేసులు పెద్దగా పనిచేయకపోవచ్చని రాజీకి వచ్చేస్తారని పోలీసు అధికారి వ్యాఖ్యానించడం విశేషం.

Share this Story:

Follow Webdunia telugu