Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాటల చిత్రీకరణలో తనీష్, మధురిమల "మౌనరాగం"

పాటల చిత్రీకరణలో తనీష్, మధురిమల
తనీష్, మధురిమ, సుహాసిని జంటగా, శ్రీ సాయిదేవ ప్రొడక్షన్స్ పతాకంపై, శానం నాగ అశోక్‌కుమార్ నిర్మిస్తోన్న చిత్రం "మౌనరాగం". ఈ చిత్రంలోని ఓ పాటను హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరిస్తున్నారు.

"ఎందాక ఎందాక నీ వేగం ఎందాక.." అనే పాటను శోబి నృత్యదర్శకత్వంలో తనీష్, మధురిమ, కొంతమంది డాన్సర్లపై ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. రెండు రోజుల్లో ఈ పాట పూర్తవుతుందని, ఈ నెల 27తో షూటింగ్ కార్యక్రమాలు పూర్తవుతాయని నిర్మాత చెప్పారు. చక్కని లవ్ ఫీల్‌వున్న కథ ఇదని, "వసంతం" తరహాలో ఈ సినిమా ఉంటుందన్నారు.

చిత్రదర్శకుడు విజయ్ బాలాజీ మాట్లాడుతూ.. హృదయ స్పందన ఎలా ఉంటుందనేది ఈ చిత్రంలో చూపించాం. ప్రేమించిన జంట యొక్క స్పందన మనస్సులో ఉండిపోతే అదే మౌనరాగమని బాలాజీ అన్నారు. టైటిల్ పాతదైనా కథ కొత్తగా ఉంటుందని చెప్పారు. ఈ చిత్రంలో రెండు విశేషాలున్నాయి. తమిళ చిత్రం "పసంగ"లో నటించిన కిషోర్ ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా నటిస్తున్నాడని, పది సంవత్సరాల అశ్విత్ అనే కుర్రాడు ఓ పాట పాడాడని దర్శకుడు వెల్లడించారు.

ఇంకా ఈ చిత్రానికి కెమెరా: షమన్ మిత్రు, సంగీతం: ఎస్.ఎ. రాజ్‌కుమార్.

Share this Story:

Follow Webdunia telugu