పవన్ కల్యాణ్ను బీట్ చేయడానికి మహేష్ మాస్టర్ ప్లాన్!
, గురువారం, 7 నవంబరు 2013 (10:55 IST)
పవర్స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'అత్తారింటికి దారేది' టాలీవుడ్ సినిమా రికార్డ్స్ని తిరగరాస్తోంది. ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే ఇంకే తెలుగు సినిమా కూడా దీని దరిదాపుల్లోకి రాకుండా ఉండేంత స్థాయికి ఎదిగిపోయింది. కాని ఈ కలెక్షన్స్ దాటగలిగే సత్తా ఎన్టీఆర్ 'రామయ్య వస్తావయ్య' సినిమాకి ఉందేమో అనుకున్నారు, కాని ఆ సినిమా నిరాశపరిచేసరికి ఇప్పుడు అందరి చూపు మహేష్ 'వన్ నేనొక్కడినే' సినిమా మీదే ఉంది.దానికి తగ్గట్టుగానే సినిమా యూనిట్ కూడా థియేటర్స్ అన్ని ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా విదేశీ మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న హీరో మహేష్ బాబు సినిమాకి విదేశీ థియేటర్స్ ఎక్కువ ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటిదాకా సినిమాలకి కేవలం 100 థియేటర్స్ మాత్రమె వాడారు, కాని ఇప్పుడు మహేష్ నేనొక్కడినే సినిమాకి 200 థియేటర్స్ బుక్ చెయ్యాలని భావిస్తున్నారు. ఇదే కనక జరిగితే సినిమాకి కొంచెం మంచి టాక్ వచ్చిన మొదటి వారంలోనే 30 - 40 కోట్లు వసూల్లు చేస్తుందని అంచనా. మొత్తానికి అత్తారింటికి దారేది రికార్డ్స్ బద్దలు కొట్టేలా ప్లాన్ చేస్తున్నారు.