పవన్కు శృతి ప్లస్ .. గోపీచంద్కు తమన్నా ప్లస్ అవుతుందా?
, శనివారం, 9 నవంబరు 2013 (18:32 IST)
రెండు మైనస్లు ప్లస్లు అవుతాయని.. ఇండస్ట్రీకూడా చెబుతోంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్, శ్రుతిహాసన్కు సక్సెస్లు లేకపోవడంతో.. ఇద్దరినీ పెట్టి బండ్లగణేష్ సినిమాతీసి హిట్ ఇచ్చాడు. అప్పుడు ఆయన అన్న మాటలవి. ఇప్పుడు గోపీచంద్ వంతు వచ్చింది. ఆయనకూ సక్సెస్లు లేకపోవడంతో... తాజాగా బి.గోపాల్ చిత్రంలో నటిస్తున్నాడు. కానీ.. ఆ చిత్రం గూడ్స్బండిలా ఆగుతూ ఆగుతూ షూటింగ్ జరుపుకుంటోంది. కాగా, ఇటీవలే 'భాయ్'తో పెద్ద విజయాన్ని ఇవ్వలేకపోయిన దర్శఖుడు వీరభద్రమ్... గోపీచంద్తో సినిమా తీయడానికి కథ చెప్పాడు. దీనికి గోపీచంద్ గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈయన పక్కన ఎవరనేది హీరోయిన్ను... వెతక్కా.. తమన్నా అని తేలింది. ఆమె అయితే సినిమాకు ప్లస్ అవుతుందని దర్శకుడు చెప్పినట్లు తెలుస్తోంది. మరి తమన్నా అంగీకరించాలంటే.. ఆగడు సినిమాపూర్తికావాల్సిందే. అప్పటిలో బిగోపాల్ సినిమా పూర్తవుతుందో లేదో చూడాలి.