Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాగార్జున- మహేష్ మల్టీస్టారర్: క్లారిటీ ఇచ్చిన సుహాసిని!

నాగార్జున- మహేష్ మల్టీస్టారర్: క్లారిటీ ఇచ్చిన సుహాసిని!
, గురువారం, 3 ఏప్రియల్ 2014 (13:09 IST)
FILE
టాలీవుడ్ కింగ్ నాగార్జున, సూపర్‌స్టార్ మహేష్‌లతో ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కించనున్నాడని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని, ఇప్పట్లో ఈ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా రావడంలేదని తాజాగా కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో నటి సుహాసిని మణిరత్నం దీనిపై క్లారిటీ ఇచ్చారు.

తన భర్త మణిరత్నం దర్శకత్వంలో నాగార్జుజన, మహేష్‌ల మల్టీస్టారర్ మూవీ రానుందని, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో ప్రారంభిస్తామని సుహాసిని స్పష్టం చేశారు. ఇందులో నాగార్జున సరసన ఐశ్వర్యరాయ్, మహేష్‌కు జోడీగా శృతిహాసన్‌ను నటింపచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ సినిమాకు ఏఆర్.రెహ్మాన్ సంగీతం అందించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu