మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ తదుపరి చిత్రం పేరు ఖరారైంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి "ధీరుడు" అనే టైటిల్ను ఖరారు చేశారు. ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు హీరోయిన్గా టీనేజ్ బేబీ కాజోల్ను ఎంపిక చేసినట్టు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ వర్గాల భొగొట్టా.
తొలుత తమన్నాతో పాటు మరికొందరు ముంబై మోడల్స్ను పరిశీలించినప్పటికీ దర్శకుడు కాజోల్వైపే మొగ్గు చూపినట్టు సమాచారం. ఈ చిత్రంలో నటించే మిగిలిన తారాగణాన్ని ఎంపక చేయాల్సి వుంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈనెల 26వ తేదీ నుంచి జరుపుకోనుంది. అలాగే "ధీరుడు"కి సంగీత బాణీలను దేవీశ్రీ ప్రసాద్ సమకూర్చనున్నట్టు తెలుస్తోంది.