త్రివిక్రమ్ స్టోరీ చెపుతుంటే నిద్రపోయా... 'అత్తారింటికి దారేది'లో పవన్ (ఫోటోలు)
, శుక్రవారం, 19 జులై 2013 (22:54 IST)
త్రివిక్రమ్ శ్రీనివాస్ జానీ చిత్రం ఫ్లాపు సమయంలో తనకు ఓ స్టోరీ చెపుతుంటే నిద్రపోయానని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చెప్పారు. హైదరాబాదు శిల్పకళా వేదికలో ఘనంగా జరిగిన అత్తారింటికి దారేది ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ కాస్త లెంగ్తీగా మాట్లాడారు.
జానీ చిత్రం ఫ్లాపుతో కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకు కథ చెప్పేందుకు వచ్చాడన్నారు. ఆ సమయంలో కథ చెపుతుంటే అదేంటో అలా నిద్రపోయానన్నారు. ఐనా త్రివిక్రమ్ ఎలాంటి ఫీలింగ్ లేకుండా మళ్లీ అదే చిరునవ్వుతో కథను చెప్పారన్నారు. అలాంటి వ్యక్తి తనకు వ్యక్తిగతంగానే కాకుండా ఎంతో వెన్నుదన్నుగా ఉండి జల్సా లాంటి హిట్ చిత్రాన్ని ఇచ్చాడని చెప్పుకొచ్చారు.