Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'తుషార్ గాంధీ'చే "మహాత్మా" ఆడియో విడుదల?

'తుషార్ గాంధీ'చే
WD
టాలీవుడ్ అగ్రహీరో శ్రీకాంత్‌ కథానాయకుడిగా కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న చిత్రం 'మహాత్మా'. మహాత్మాగాంధీ ఆశయాలు నేపథ్యంలో ఈనాటి ట్రెండ్‌‌కు అనుగుణంగా చిత్రం రూపొందుతోంది.

ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. దాదాపు షూటింగ్‌ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఆడియోను ఆగస్టు 15న విడుదలచేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇందులో విశేషమేమంటే..? గాంధీ మనవడు "తుషార్‌గాంధీ" చేతులమీదుగా ఈ కార్యక్రమాన్ని జరపాలని చిత్ర యూనిట్ సభ్యులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన నుంచి గ్రీన్‌సిగ్నల్‌ తెచ్చేందుకు ప్రముఖ రాజకీయ నాయకుడి సలహాలు తీసుకున్నారు.

మరోవైపు.. చిరంజీవి సన్నిహితుడుగా శ్రీకాంత్‌ మంచి పేరున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి, శ్రీకాంత్‌లు నటించిన "శంకర్‌దాదా జిందాబాద్‌" సినిమాను కూడా తుషార్‌గాంధీకి చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu