తమన్నాకు ఝలక్ ఇచ్చిన సమంత... లక్కీ మస్కట్!
, బుధవారం, 9 అక్టోబరు 2013 (11:12 IST)
క్రేజీ బ్యూటీ సమంత ఇప్పుడు టాలీవుడ్ నెంబర్వన్ హీరోయిన్ అయిపోయింది. వరుసగా హిట్ కొట్టి లక్కీ మస్కట్గా పేరుతెచ్చుకొంది. ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం సమంత నామజపం చేస్తోంది. ఈ అమ్మడు తమ సినిమాలో నటిస్తే చాలు హిట్ కొట్టడం ఖాయమని దర్శకనిర్మాతలంతా సెంటిమెంట్ ఫీలవుతున్నారు. అందుకే వరుసగా అగ్రహీరోల సినిమాలన్నింటిలో సమంత కథానాయకగా ఎంచుకుంటున్నారు. పవన్తో 'అత్తారింటికి దారేది' బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాక సమంత రేంజు అమాంతం పెరిగింది. మరో నాలుగేళ్లు ఈ అమ్మడి డైరీ ఫుల్. ఈ నెలలోనే ఎన్టీఆర్ 'రామయ్యా ...' సినిమాతో మరో హిట్కొట్టడానికి రెడీ అవుతోంది. అలాగే ఎన్టీఆర్ సరసన నటిస్తూ 'రభస' చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగు తోంది. అదేగాక అక్కినేని 'మనం'లోనూ ఓ నాయకగా నటిస్తోంది. అంతే కాకుండా సూర్యతో ఓ తమిళ సినిమాలోనూ సమంత కథానాయకగా నటిస్తోంది. ఆటోనగర్ సూర్యలోనూ సమంత కథానాయక. ఇవేగాక బెల్లకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాలోనూ అమ్మడే కథానాయక. వాస్తవానికి ఈ సినిమాలో తమన్నాను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ అనూహ్యంగా సమంత ఆ స్థానాన్ని రీప్లేస్ చేసింది. లక్కీ మస్కట్ సమంత చూపిస్తున్న హవా చూస్తుంటే టాలీవుడ్లో నంబర్వన్ హీరోయిన్ అనడం అతిశయోక్తి కానేకాదు.