టాలీవుడ్ను వదలను ... బాలీవుడ్కు వెళ్లను : మహేష్ బాబు
, బుధవారం, 5 జూన్ 2013 (13:30 IST)
తెలుగు ఇండస్ట్రీని వదిలి వెళ్లే ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదని సూపర్స్టార్ మహేష్ బాబు స్పష్టం చేశారు. విజయవాడ ఏలూరు రోడ్డులో కొత్తగా ఏర్పాటైన రెయిన్ బో చిల్డ్రన్ హాస్పటల్ను మహేష్ బాబు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో కాసేపు ముచ్చటించారు.మహేష్ బాబు మాట్లాడుతూ అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించబడిన రెయిన్ బో హాస్పిటల్ అత్యుత్తమ సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. చిన్న పిల్లల ఆరోగ్యం కోసం తమవంతు సహాయం అందిస్తామన్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న '1 నేనొక్కడినే' చిత్రం టీజర్ యూట్యూబ్లో రికార్డు స్థాయిలో వీక్షించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాలో కొత్త లుక్తో కనిపిస్తానని తెలిపారు. సినిమాలు చూసి యూత్ చెడిపోతున్నారని ఓ విలేఖరి ప్రశ్నించగా....తానెప్పుడూ అలాంటి సినిమాలు చేయనని, తన సినిమాలు చూసి ఇప్పటివరకు ఎవరూ చెడిపోలేదని స్పష్టం చేసారు. బాలీవుడ్లో సినిమా చేస్తున్నారట కదా అన్న ప్రశ్నకు స్పందిస్తూ, వేరే ఇండస్ట్రీలోకి వెళ్లే ఆలోచన లేదని గతంలోనే చెప్పాను, ఇప్పుడూ అదే చెబుతున్నాను. మరో పదేళ్ల పాటు టాలీవుడ్లోనే ఉంటానని ప్రిన్స్ స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఇప్పట్లో లేదని ఆయన తెలియజేశారు.