'పోకిరి'లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పర్స్టార్ మహేష్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సూపర్ కాంబినేషన్లో వస్తోన్న మరో ప్రెస్టీజియస్ మూవీ 'బిజినెస్ మేన్'. వరసగా సూపర్హిట్ చిత్రాల్ని అందిస్తున్న ఆర్.ఆర్. మూవీ మేకర్స్ అధినేత, అగ్రనిర్మాత డా వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 15వ తేదీన ఈ చిత్రం షూటింగ్ సంస్థ కార్యాలయంలో యూనిట్ సభ్యుల మధ్య ప్రారంభమైంది. దేవుని పటాలపై తొలిషాట్ చిత్రీకరించారు.
ఈ సందర్భంగా హీరో మహేష్ మాట్లాడుతూ.. ''పూరి జగన్నాథ్గారి కాంబినేషన్లో 'పోకిరి' తర్వాత చేస్తున్న మరో సెన్సేషనల్ మూవీ. కథ విన్నప్పట్నించీ ఎంతో ఎక్సైట్ అవుతున్నాను. హీరో క్యారెక్టరైజేషన్ ఎక్స్ట్రార్డినరీగా వుంటుంది. ఆర్.ఆర్. వెంకట్గారి బేనర్లో ఈ సినిమా చెయ్యడం చాలా హ్యాపీగా వుంది. పూరిగారి కాంబినేషన్లో అందరూ ఎక్స్పెక్ట్ చేసే రేంజ్లో ఈ చిత్రం వుంటుంది''
అన్నారు.
దర్శకులు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. '''పోకిరి'లాంటి బ్లాక్బస్టర్ తర్వాత మళ్ళీ మహేష్తో చెయ్యడం చాలా హ్యాపీగా వుంది. 'బిజినెస్ మేన్' కోసం ఫాన్స్తో పాటు నేను కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నాను. అంటే అంత కాన్ఫిడెంట్గా వున్నాను ఈ సబ్జెక్ట్ మీద. ఇంతవరకూ నేను డైరెక్ట్ చేసిన అన్ని సినిమాల్లోకి ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ బెస్ట్ అనిపించేలా వుంటుంది. 'బిజినెస్ మేన్' లవ్ అండ్ యాక్షన్ ప్రధానంగా వుండే సినిమా. వెంకట్గారి లాంటి డైనమిక్ ప్రొడ్యూసర్తో వర్క్ చెయ్యడం చాలా ఆనందంగా వుంది. హీరోని, డైరెక్టర్ని ఎక్సైట్ చేసే గొప్ప నిర్మాత వెంకట్గారు. సెప్టెంబర్ 1న షూటింగ్ స్టార్ట్ చేసి సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యాలని ప్లాన్'' చేస్తున్నట్టు చెప్పారు.
అనంతరం నిర్మాత వెంకట్ మాట్లాడుతూ.. ''మహేష్బాబు, పూరి జగన్నాథ్ల క్రేజీ కాంబినేషన్లో ఆర్.ఆర్ మూవీ మేకర్స్ బేనర్పై నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'బిజినెస్ మేన్'. ఈ స్టోరీ లైన్ సూపర్బ్. మహేష్ని ప్రేక్షకులు, ఫాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి క్యారెక్టరైజేషన్తో వస్తోన్న సినిమా
ఇది. చాలా స్టైలిష్గా, లావిష్గా, హై టెక్నికల్ వేల్యూస్తో రూపొందుతున్న ఈ చిత్రంపై మహేష్, పూరిగారు చాలా కాన్ఫిడెంట్గా వున్నారు. పర్ఫెక్ట్ షెడ్యూల్లో ఫినిష్ చేసి వరల్డ్వైడ్గా జనవరి 12న గ్రాండ్గా రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సంస్థ ఇమేజ్ని
మరింత పెంచే చిత్రం అవుతుంది'' అన్నారు.
సూపర్స్టార్ మహేష్ సరసన గ్లామర్స్టార్ కాజల్ నటించే ఈ చిత్రంలో భారీ తారాగణం ముఖ్యపాత్రలు పోషిస్తారు. ఇంకా ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఫోటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఆర్ట్: చిన్నా, ఫైట్స్: విజెయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, కో-డైరెక్టర్: విజయ్ రామ్ప్రసాద్, కో-ప్రొడ్యూసర్: వి.సురేష్రెడ్డి, నిర్మాత: డా|| వెంకట్, కథ-స్క్రీన్ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.