Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఛార్మీ గాల్లోకి ముద్దులు... సెమీస్‌‌లోకి తెలుగువారియర్స్

ఛార్మీ గాల్లోకి ముద్దులు... సెమీస్‌‌లోకి తెలుగువారియర్స్
, సోమవారం, 4 మార్చి 2013 (13:28 IST)
FILE
సీసీఎల్ క్రికెట్ లీగ్‌‌లో తారల సందడి అంతకంతకూ పెరిగింది. కథానాయికలు, సినీతారలు వారివారి జట్లకు ప్రోత్సహాన్ని అందిస్తున్నారు. ఆదివారం తెలుగు వారియర్స్, భోజ్‌పూర్ దంబాంగ్స్‌‌‌‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ ప్రచార కర్త ఛార్మీ మైదానంలో కేరింతలు కొడుతూ ప్రోత్సహించింది. గాల్లోకి ముద్దులు విసురుతూ...తెలుగువారియర్స్‌కు ఉత్సాహాన్ని అందించింది.

తప్పకుండా విజయం సాధించాల్సిన మ్యాచ్‌లో తెలుగువారియర్స్ అధ్బుత ప్రదర్శన చేసింది. అన్ని విభాగాల్లోని నైపుణ్యం సాధించి ప్రత్యర్ధిని దెబ్బకొట్టింది. ఆదివారం భోజ్‌పూర్ దంబాంగ్స్‌‌‌‌తో ఆడిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది తెలుగు వారియర్స్.

తొలుత బ్యాటింగ్ చేసిన తెలుగు వారియర్స్ నిర్ణీత ఓవర్లలో 188 పరుగుల భారీస్కోరు సాధించింది. ఆదిత్య (67), చరణ్ తేజ (74) పరుగులు సాధించారు. తర్వాతి భోజ్‌పూర్ దబాంగ్స్‌ను 17.1 ఓవర్లలో 89 పరుగులకు ఆలౌట్ చేసి 99 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించింది. రఘు (4), నందకిశోర్ (2) వికెట్లు తీసారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా చరణ్ తేజ ఎంపికయ్యాడు.

Share this Story:

Follow Webdunia telugu