ఇండియా ఫుడ్ గ్రేయిన్స్ ప్రై.లి. వైజాగ్ సమర్పణలో విశ్వనాధ్ హీరోగా ఆర్.వి.జోసఫ్ దర్శకత్వంలో 'శాంతి సుధా క్రియేషన్స్' పతాకంపై ఎ.డి. వెంకటేశ్వరావు నిర్మిస్తున్న 'కల్వరి స్వరం' చిత్రం పాటల రికార్డింగ్ ధాత్రి డిజిటల్లో స్టూడియో జరుగుతుంది.
ఈ సందర్భంగా ఎ.డి. వెంకటేశ్వరావు చిత్ర విశేషాలను తెలుపుతూ... క్రీస్తు మహిమలను గూర్చి అన్ని భాషలలో నిర్మిస్తున్నాము. ప్రస్తుతం ఈ సినిమాలోని ఆరు పాటలను సురేష్ సంగీత దర్శకత్వంలో పాటల రికార్డింగ్ జరుగుతోంది.
ఈ నెల 18 నుంచి సింగిల్ షెడ్యూల్ రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ పరిసర ప్రాంతలలో షూటింగ్ జరుగుతుంది. గతంలో జీసెస్ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. ఎవరూ టచ్ చేయని పాయింట్స్ను ఇందులో చూపించునున్నాము.
ఈ చిత్రానికి కధ, మాటలు వెంకట్ బొలిశెట్టి, సంగీతం: సురెష్, కెమెరా: వెంకట్, సహనిర్మాతలు : రవి, నాగచంద్ర, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : యమ్.డి. అబ్దుల్ బుకారీ, సమర్పణ : ఇండియా ఫుడ్ గ్రేయిన్స్ ప్రై.లి., వైజాగ్, నిర్మాత: ఎ.డి. వెంకటేశ్వరావు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ఆర్.వి.జోసఫ్.