Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కృష్ణుడు హీరోగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో చిత్రం

కృష్ణుడు హీరోగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో చిత్రం
కృష్ణుడు కథానాయకుడుగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో నవచిత్రాలయ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ జూన్ 7న ఉదయం 9 గంటల 30 నిమిషాలకు రాజోలులో ప్రారంభమైంది. తొలిషాట్‌కు ప్రముఖ న్యాయవాది పొన్నాడ హనమంతరావు కెమేరా స్విచాన్ చేయగా, ఎంఎల్సీ చైతన్యరాజు క్లాప్ ఇచ్చారు.

తొలిషాట్ దర్శకత్వాన్ని ప్రముఖ దర్శకుడు సుకుమార్ తండ్రి తిరుపతిరావు నాయుడు నిర్వహించారు. జులై 20 వరకూ రాజోలు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిగే ఈ చిత్రంలో కృష్ణభగవాన్, ఎమ్మెస్ నారాయణ, కొండవలస, పృధ్వీ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి కెమేరా: శరత్, సంగీతం: శ్రీవసంత్, నిర్మాతలు: నారాయణ్, రాధికా రాణి, రత్నకుమార్, కథ- స్ర్కీన్‌ప్లే- దర్శకత్వం: వేగేశ్న సతీష్

Share this Story:

Follow Webdunia telugu