ఇద్దరమ్మాయిలతో సినిమాను కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి చూశారు. మెగా ఫ్యామిలో కోసం ప్రసాద్ ల్యాబ్స్లో స్పెషల్ షో ఏర్పాటు చేశారు. చిరంజీవితో పాటు రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ తదితరులు ఈ సినిమాను చూశారు. సినిమా సూపర్ అని కితాబిచ్చారు.
ఇంకా అల్లు అర్జున్ డ్యాన్స్, ఫైట్స్, పూరీ జగన్నాథ్ డైరక్షన్ అదుర్స్ అంటూ మెగా ఫ్యామిలీ ప్రశంసల వర్షం కురిపించింది. ఇందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి "టాప్ లేచిపోవడం గ్యారంటీ" అంటూ కామెంట్ ఇచ్చేశారు.
ఇకపోతే, శుక్రవారం విడుదలైన ఇద్దరమ్మాయిలతో సినిమాలో అల్లు అర్జున్, కేథరిన్, అమలాపాల్ హీరో హీరోయిన్లుగా నటించగా, పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మించారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు.