అల్లు శిరీష్పై పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి!
అల్లు శిరీష్పై ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవలే రామ్ చరణ్ తేజ ఇద్దరు టెక్కీలపై చేయి చేజేసుకుని వార్తల్లోకెక్కిన నేపథ్యంలో తాజాగా గౌరవం సినిమా హీరో అల్లు శిరీష్పై ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా ఉంది. కేంద్ర మంత్రి చిరంజీవి మేనల్లుడు, నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అయిన శిరీష్ ఒక హోటల్లో తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని న్యూఢిల్లీకి చెందిన ఆ యువతి ఆదివారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.శనివారం రాత్రి స్థానికంగా ఒక పబ్లో మద్యం మత్తులో ఉన్న శిరీష్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఢిల్లీ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు శిరీష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.