Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబుకు షాక్: కిషన్‌రెడ్డి పావుగా టీఆర్ఎస్ ప్లాన్!

చంద్రబాబుకు షాక్: కిషన్‌రెడ్డి పావుగా టీఆర్ఎస్ ప్లాన్!
, మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (18:53 IST)
తెలంగాణ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు టీఆర్ఎస్ గట్టి షాక్ ఇవ్వనుంది. ఈ నెల 23న చంద్రబాబు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు.

ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి త్వరలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు రెండు రోజులుగా బాగా ప్రచారం జరుగుతోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కిషన్ రెడ్డి తమ పార్టీలో చేరితే పార్టీకి లాభం చేకూరుతుందని టీఆర్‌ఎస్ అధిష్టాన వర్గం భావిస్తోంది. 
 
చంద్రబాబు నాయుడు పాలమూరు జిల్లాలో పర్యటించే రోజునే కిషన్ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకోవాలని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో రోజురోజుకు  క్షీణిస్తున్న టీడీపీ పరిస్థితి కిషన్ రెడ్డి కూడా పార్టీని వీడితే మరీ దయనీయంగా మారుతుంది. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డి మంగళవారం ఇబ్రహీంపట్నంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. తన రాజకీయ భవిష్యత్పై కిషన్ రెడ్డి ప్రకటన చేసే ఛాన్సుందని తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu