Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యస్... ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతాం... కేసీఆర్ కుమార్తె కవిత, తెదేపా కొంప కొల్లేరేనా?

ప్రత్యేక హోదా ఉద్యమం తెలుగుదేశం పార్టీ కొంప ముంచుతుందా...? అంటే అవుననే సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఎన్నికల వేళ చెప్పిన తెదేపా-భాజపా రెండూ రివర్స్ గేర్లు వేసుకున్నాయి. ప్రతి సభలోనూ ఏపీ ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తామంటూ హామీలిచ్చ

యస్... ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతాం... కేసీఆర్ కుమార్తె కవిత, తెదేపా కొంప కొల్లేరేనా?
, బుధవారం, 25 జనవరి 2017 (15:08 IST)
ప్రత్యేక హోదా ఉద్యమం తెలుగుదేశం పార్టీ కొంప ముంచుతుందా...? అంటే అవుననే సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఎన్నికల వేళ చెప్పిన తెదేపా-భాజపా రెండూ రివర్స్ గేర్లు వేసుకున్నాయి. ప్రతి సభలోనూ ఏపీ ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తామంటూ హామీలిచ్చిన అధికార పార్టీలు ప్లేటు ఫిరాయించడంపై గత రెండేళ్లుగా అప్పుడప్పుడు ఆందోళనలు పెల్లుబుకుతూనే వున్నాయి. 
 
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్, జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ ప్రత్యేక హోదా కోసం ఎవరిదారిలో వారు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. దీనితోపాటు తాజాగా తెలంగాణ రాష్ట్రం కూడా గొంతు కలుపుతోంది. తెరాస ఎంపీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత సైతం ఏపీ ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో పోరాడుతామంటూ ప్రకటించారు. 
 
తెలుగు రాష్ట్రాల స‌మస్య‌ల‌పై తెలుగువారమంతా క‌లిసి పోరాడాల్సి వుందని, అంతా కలిస్తే అనుకున్నది సాధించవచ్చని ఆమె తెలిపారు. ప్రత్యేక హోదా వచ్చేవరకూ తమవంతు ప్రయత్నం చేస్తామని ఆమె వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను కేంద్రం భేషరతుగా నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. మొత్తమ్మీద ప్రత్యేక హోదా కోసం ఇటు ఏపీ విపక్ష పార్టీలతో పాటు తెలంగాణ అధికార పార్టీ కూడా కలిసిరావడం తెదేపాకు ఇబ్బందికర పరిస్థితులను తేవడం ఖాయమే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జల్లికట్టుకు మళ్లీ కష్టాలు.. సుప్రీంలో పిటిషన్ దాఖలు.. 30న విచారణ..