Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రేవంత్ రెడ్డి గుండు గీయించుకుంటారా? : తెరాస నేతలు

రేవంత్ రెడ్డి గుండు గీయించుకుంటారా? : తెరాస నేతలు
, ఆదివారం, 21 సెప్టెంబరు 2014 (15:33 IST)
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై టీ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు నిరాధారమని టీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఆరోపణలు రుజువు చేయలేకపోతే రేవంత్ గుండు గీయించుకుంటారా? అని వారు సవాల్ విసిరారు. 
 
మెట్రో విషయంలో రేవంత్ చెబుతున్న విషయాలు నిజమని తేలితే తాము దేనికైనా సిద్ధమని వారు ప్రకటించారు. చంద్రబాబు చేతిలో రేవంత్ రెడ్డి కీలుబొమ్మ అని దుయ్యబట్టారు. చంద్రబాబు... రేవంత్ రెడ్డిని అడ్డుపెట్టుకుని మెట్రో ప్రాజెక్టును అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని వారు ఆరోపించారు. రేవంత్ మీడియా ఎదుటకు వస్తే చర్చకు సిద్ధమని టీఆర్ఎస్ నేతలు అన్నారు. 
 
కాగా, మెట్రో రైల్ ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న విషయం తెల్సిందే. వీటికి కౌంటర్ ఇచ్చేలా తెరాస నేతలు రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. 

Share this Story:

Follow Webdunia telugu