Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణా ఇచ్చినా కృతజ్ఞత లేకుండా కాంగ్రెస్‌ను చంపేశారు : సర్వే

తెలంగాణా ఇచ్చినా కృతజ్ఞత లేకుండా కాంగ్రెస్‌ను చంపేశారు : సర్వే
, సోమవారం, 1 సెప్టెంబరు 2014 (14:41 IST)
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఒక ప్రాంతంలో (సీమాంధ్ర) పార్టీ నష్టపోతుందని తెలిసినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని కేంద్ర మాజీ మంత్రి, టీ కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ గుర్తు చేశారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ  పట్ల ఏమాత్రం కృతజ్ఞత చూపకుండా తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపితం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి అసలు కారణమైన 'తల్లి'ని (సోనియాను ఉద్దేశించి) తెలంగాణ ప్రజలు పూర్తిగా మరిచిపోయారన్నారు. అనేక కష్టనష్టాల కోర్చి తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా ఏర్పాటు చేస్తే... కనీస కృతజ్ఞత లేకుండా ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారని ఆరోపించారు. 
 
సీమాంధ్రలో పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా... సోనియా తెలంగాణ ఇచ్చారని మెదక్ ఉపఎన్నిక ప్రచారంలో మాజీ మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఇప్పటికైనా ప్రజలు గుర్తించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకురావాలని ఆయన కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu