Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

T భవన్ జోలికొస్తే టీడీపీ ఆఫీసులను పేల్చేస్తాం : మంత్రి మహేందర్ రెడ్డి

T భవన్ జోలికొస్తే టీడీపీ ఆఫీసులను పేల్చేస్తాం : మంత్రి మహేందర్ రెడ్డి
, బుధవారం, 22 అక్టోబరు 2014 (19:11 IST)
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ జోలికి వచ్చినా.. చిన్నపాటి దాడి జరిగినా తెలంగాణా రాష్ట్రంలోని టీడీపీ కార్యాలయాలను పేల్చేస్తామని తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి హెచ్చరించారు. 
 
టీ టీడీపీ కార్యకర్తలు తలచుకుంటే తెలంగాణ భవన్ ఆనవాళ్లు కూడా మిగలవంటూ ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డి చేసిన హెచ్చరికపై మంత్రి మహేందర్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. 
 
టీడీపీ తమ పార్టీ జోలికి వస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. టీఆర్ఎస్ భవన్ జోలికి వస్తే టీడీపీ కార్యాలయాలు లేకుండా చేస్తామని అన్నారు. టీడీపీ వైఖరి మారకపోతే నల్లగొండ తరహా దాడులు కొనసాగుతాయని చెప్పారు. నల్లగొండలో జరిగిన దాడిలో రైతులు, ప్రజలే పాల్గొన్నారని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu