Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణాకు తిరుమల వెంకన్న రూ.241 కోట్ల అప్పు : హరీష్ రావు

తెలంగాణాకు తిరుమల వెంకన్న రూ.241 కోట్ల అప్పు : హరీష్ రావు
, బుధవారం, 26 నవంబరు 2014 (11:29 IST)
తెలంగాణ రాష్ట్రానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.241 కోట్ల మేరకు బకాయిలు పడివుందని, ఈ బకాయిలను రాబట్టేందుకు కృషి చేస్తున్నట్టు తెలంగాణా మంత్రి హరీష్ రావు వెల్లడించారు. బుధవారం తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతూ.. దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 
 
టీటీడీ నుంచి రాష్ట్రానికి రూ.241 కోట్లు రావాల్సి ఉందని ఆయన తెలిపారు. విభజన చట్టం అనుసరించి దేవాదాయ శాఖ నిధులు ఇరు రాష్ట్రాలకు పంచాలన్నారు. టీటీడీ నుంచి రావాల్సిన బకాయిలను రాబడతామని హరీష్ రావు తెలిపారు. ఇప్పటికే దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించిందని, రాబోయే బడ్జెట్లో ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu