Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెరాస చెంతకు తీగల - సాయన్న : జగన్ మీడియాలో ప్రచారం!

తెరాస చెంతకు తీగల - సాయన్న : జగన్ మీడియాలో ప్రచారం!
, సోమవారం, 29 సెప్టెంబరు 2014 (12:04 IST)
ఆంధ్రప్రదేశ్‌లో అధికారం దక్కించుకోలేకపోయిన జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా పార్టీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలహీనపరిచేందుకు సరికొత్త దుష్ప్రచారానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. పలువురు తెలుగుదేశం ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరబోతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్‌లో చేరబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం చేస్తోంది. 
 
అయినప్పటికీ ఆయన చేరుతున్న దాఖలాలు కనిపించడం లేదు. అలాగే ఇప్పుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు... మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న టీఆర్ఎస్‌లో చేరబోతున్నారని ప్రచారం చేస్తోంది. ఇక్కడ ఇలా ప్రచారం చేస్తున్న జగన్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ఎంతమంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో లెక్కలు వేసుకోవడం విస్మరించడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu