Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ సీటును దొంగలించారు.

శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ సీటును దొంగలించారు.
, గురువారం, 29 జనవరి 2015 (21:14 IST)
అప్పట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ సీటును దొంగిలించారనీ, అది తన సీటని తెలుగుదేశం పార్టీ నేత కూన వెంకటేష్ గౌడ్ మండిపడ్డారు. అది తనకు ఇచ్చి తీరాల్సిందేనని  ఆయన డిమాండ్ చేశారు. 
 
నాలుగేళ్ల నుంచి ఆ సీటు కోసం కష్టపడితే తలసాని చాకచక్యంగా దక్కించుకున్నారన్నారు. ఈసారి మాత్రం ఆ సీటు తనదేనని వెంకటేశ్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ముఖేష్ గౌడ్ లేదా? మరెవరు పోటీకి వచ్చినా.. సనత్ నగర్ టికెట్ తనకే దక్కుతుందన్నారు.
 
గత ఎన్నికల్లో చంద్రబాబు తనకు సరిగ్గా మాట ఇవ్వలేదని.. అయితే ఈసారి ఆయన నుంచి తనకు హామీ లభించిదన్నారు. దేవేందర్ గౌడ్ కూడా తనకు మద్దతు ఇస్తామని తెలిపారన్నారు. ఇప్పుడు నడుస్తున్నదంతా తప్పుడు ప్రచారమేనన్నారు. ముఖేష్ గౌడ్ తనకు బంధువేనని ఒక ప్రశ్నకు సమాధానంగా వెంకటేశ్ గౌడ్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu