Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సండ్రకు టీ ఏసీబీ నోటీసులు.. డెడ్‌లైన్ 6వ తేదీ 5 గంటల వరకు...

సండ్రకు టీ ఏసీబీ నోటీసులు.. డెడ్‌లైన్ 6వ తేదీ 5 గంటల వరకు...
, శనివారం, 4 జులై 2015 (16:28 IST)
ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు తెలంగాణ రాష్ట్ర ఏసీబీ మరోమారు నోటీసులు జారీ చేసింది. ఈనెల 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తమ ఎదుట హాజరుకావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది. 
 
ఈ నోటీసులను స్వయంగా ఇచ్చేందుకు టీ ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లోని సండ్ర నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో సండ్ర ఇంట్లో లేక పోవడంతో గోడకు నోటీసు అంటించి వచ్చారు. 
 
ఇదిలావుండగా పది రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న సండ్ర.. ఇటీవలే ఖమ్మంకు వెళ్లి, ఏసీబీకి లేఖ రాసిన విషయంతెల్సిందే. ఏసీబీ విచారణకు సిద్ధమని, ఎపుడు పిలిస్తే అపుడు వస్తానని లేఖలో పేర్కొన్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ నోటీసులు జారీ చేయడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu