Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో నిద్రిస్తే చనిపోతారనే ప్రచారం!!

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో నిద్రిస్తే చనిపోతారనే ప్రచారం!!
, గురువారం, 21 ఆగస్టు 2014 (10:53 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొనివుంది. మొన్నటికి మొన్న అనేక జిల్లాల్లో భూమి కంపిస్తుందనే పుకార్లు చెలరేగాయి. దీంతో అనేక జిల్లాల వాసులు రాత్రంతా రోడ్డుపైనే జాగారం చేశారు. తాజాగా అంటే బుధవారం దక్షిణ తెలంగాణలోని ప్రజలు పడుకుటే చనిపోతారనే వదంతులతో కాలక్షేపం చేశారు. చాలా ప్రాంతాల్లో జనాలు ఇళ్లలో నుండి బయటకు వచ్చి రోడ్లపై జాగారం చేశారు. ఫోన్ల ద్వారా ఈ పుకార్లు షికారు చేయడంతో ప్రజలు జాగారం చేయక తప్పలేదు. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో కూడా ఉంది. 
 
పడుకున్నవారంతా చనిపోతారనే వదంతులతో వదంతులతో నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని పలు చోట్ల ప్రజలు రాత్రంతా మేల్కొనే ఉన్నారు. వీధుల్లోకి వచ్చారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి, నల్లగొండ జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్ శాసనసభా నియోజకవర్గాల్లో, నేరేడుచర్ల, దామచర్ల, నాంపల్లి, జాజిరెడ్డిగూడెం మండలాల్లో ప్రజలు రాత్రంతా జాగారం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu